Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఉదయం అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై అపోలో వైద్యులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి మంత్రిని తీసుకువచ్చారు. అసుపత్రికి వచ్చే సరికే ఆయన తీవ్ర గుండెపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు.
Mekapati Goutham Reddy: అసుపత్రికి వచ్చే సమయానికే
అప్పటికే ఆయన నాడి అందకపోవడం, శ్వాస కూడా తీసుకోలేకపోవడంతో అత్యవసర వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. ఎమర్జెన్సీ మెడికల్ టీమ్, కార్డియాలజిస్ట్ లు, క్రిటికల్ కేర్ వైద్యులతో సహా ఆసుపత్రిలోని స్పెషలిస్టులు అందరూ ఆయనను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 90 నిమిషాల పాటు వైద్యులంతా తీవ్రంగా ప్రయత్నించినా మంత్రి మేకపాటి గౌతమ్ ను బ్రతికించలేకపోయారు. ఉదయం 9.16 గంటలకు ఆయన మరణించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు.
Read More: Big breaking: మంత్రి మేకపాటి గుండెపోటుతో మృతి