ఎన్నికలు అంటే చాలు బెట్టింగులు.. బెట్టింగు బోర్డుల లెక్కలు హడావిడి మామూలుగా ఉండదు. ఇక తెలుగు రాజకీయాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏపీలో ఉన్న బెట్టింగ్ బోర్డుల హడావిడి మామూలుగా ఉండదు. ఏపీలో బెట్టింగ్ రాయుళ్లు కోట్లలో పందాలకు ఉసిగొలుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు జరుగుతోన్న ఎన్నికల్లో నిన్న మొన్నటి వరకు ఒకలా ఉన్న బెట్టింగ్ ట్రెండ్ ఇప్పుడు మారుతున్నట్టు కనిపిస్తోంది.
పదిరోజుల ముందు వరకు ఎవరిని కదిపినా కూటమికి మొగ్గు ఉందన్న మాటే వినిపించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు బెట్టింగ్ బోర్డుల వాళ్లను కదిలిస్తే ఇదే మాట వినిపించేది. నియోజకవర్గాల వారీగా కూడా ఎవరు ఫేవరెట్లో ఉన్నారో చెపుతున్నారు. ఎప్పుడు అయితే జనసేన + టీడీపీ కూటమి కట్టిందో అప్పటి నుంచి కూడా చంద్రబాబు సీఎం అవుతారంటూ.. ఆయనే ఫేవరెట్గా ఉన్నారు.
అప్పుడు వైసీపీ బెట్టింగ్ బోర్డులలో కాస్త వెనకపడే ఉంది. ఈ కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడం.. బీజేపీకి సీట్లు కేటాయిండం.. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాక చూస్తే సీన్ మారిపోయింది. కేవలం వారం రోజుల్లో సీన్ రివర్స్ అయ్యింది. నేషనల్ మీడియా సర్వేల్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీకి 7-8 ఎంపీ సీట్లు వస్తాయని లెక్కలు కట్టారు.
ఇప్పుడు అవే సంస్థలు 10 – 11 వరకు వైసీపీకి సీట్లు వస్తాయంటున్నారు. ఏదేమైనా వారం రోజులుగా గ్రౌండ్ రిపోర్ట్ అయితే మారినట్టే కనిపిస్తోంది. ఇంకా నామినేషన్ల పర్వం ప్రారంభం కాలేదు. ఇది ఎటు వైపు నుంచి ఎటు టర్న్ తీసుకుంటుందో ? ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ? చూడాలి.