Road Accident: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున కోడుమూరు సమీపంలో జరిగింది. బొలేరో, ఐచర్ వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో బొలెరో వాహనాన్ని ఐచర్ ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కొరకు తరలించారు. మృతులు హోళగుండ మండలం హెబ్బటంకు చెందిన మల్లయ్య, కురకుంద కు చెందిన వీరయ్య, కొత్తపేటకు చెందిన ముత్తయ్యలుగా గుర్తించారు. వీరంతా అడవి పందుల పేటకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.