Chandra babu : గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ TDP ఘోర ఓటమి పాలైన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు Chandra babu ఢిల్లీ Delhi వెళ్లడం పూర్తిగా మానేశారు. ఎన్నికలకు ముందే ఎన్డీఏ NDA తో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజెపీ పెద్దలతో మళ్లీ సంబంధాలు కలుపుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని కానీ అటునుండే సానుకూల సంకేతాలు రాలేదని వార్తలు వచ్చాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్లు గతంలో బీజెపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు తరువాత కలిశారు. మళ్లీ కటీఫ్ చెప్పారు. ప్రస్తుతం గ్యాప్ మాత్రం కొనసాగుతోంది.
అయితే ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపిలో టీడీపీ నాయకులపై దాడులు, అక్రమ కేసులు, దేవాలయాలపై దాడులు తదితర అంశాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో రోజు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఒకే రోజు రెండు సంఘటనలు జరిగాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం, విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై మారణాయుధాలతో దాడి తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలో ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోనూ చంద్రబాబు భేటీ అవుతారని టాక్. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి త్వరలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. మంగళవారం రాష్ట్రంలో జరిగిన ఘటనలను టీడీపీ ఎంపిలు నేడు ఢిల్లీలో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. అదే విధంగా చంద్రబాబు కూడా ఎంపిలతో వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.