Pawan Kalyan : పవన్ కల్యాణ్ తెలుగు రాజకీయాల్లో పార్టీ పరంగా రాణించాలంటే కచ్చితంగా ప్రజా బలం తో పాటు మీడియా సపోర్ట్ ఉండాల్సిందే. ఈ విషయం లో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు ఉన్న పార్టీ టిడిపి. తెలుగుదేశం పార్టీకి తెలుగు రాజకీయాలలో మీడియా సపోర్ట్ ఎక్కువ అని అందరికీ తెలుసు. మీడియా సపోర్ట్ వల్లే ఇంత కాలం చంద్రబాబు రాజకీయం చేస్తూ వచ్చారని ప్రత్యర్థులు అంటుంటారు. ఇదిలా ఉంటే రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyan క్రమక్రమంగా దూకుడు పెంచుతూ ప్రజాక్షేత్రంలోకి వస్తున్న తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తన పార్టీ కంటూ సెపరేట్ న్యూస్ ఛానల్ ఉండే రీతిలో అండర్ గ్రౌండ్ లో కీలక మీడియాకి చెందిన బడా బడా పెద్దలతో మాట్లాడి సరికొత్త ఛానల్ అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
Pawan Kalyan : తెలుగు రాష్ట్రాలలో పట్టు పెంచుకోవటానికి బిజెపి
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ బిజెపి పెద్దలతో పాటు మోడీ సపోర్ట్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క బిజెపి కూడా తెలుగు రాష్ట్రాలలో పట్టు పెంచుకోవటానికి ఇదే తరహాలో సరికొత్త ఛానల్ బిజెపికి సపోర్ట్ గా .. బీజేపీ భావజాలాలు ప్రజలకు తెలియజేసే రీతిలో ఉండేవిధంగా నిర్ణయాలు చేస్తున్నట్లు టాక్. బీజేపీ విషయం పక్కన పెడితే మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం త్వరలో కచ్చితంగా ఒక సపరేట్ న్యూస్ ఛానల్ తనకంటూ ఉండే రీతిలో పక్కా ఐడియాలజీ తో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
ఎందుకంటే దాదాపు ఈ ఏడాది, వచ్చే ఏడాది చాలా వరకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లలో బిజీ అవుతున్న తరుణంలో.. రాజకీయాల పరంగా తాను చెప్పదలుచుకున్నది, ఈ మోడీ సపరేట్ న్యూస్ ఛానల్ ద్వారా చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ 99 టీవీ మాత్రమే జనసేన పార్టీకి సపోర్ట్ వుండగా, త్వరలో కొత్త ఛానల్ రాబోతున్నట్లు వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వార్త తెలుసుకుని విజిల్స్ వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో టిడిపికి వైసీపీకి మీడియా బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో వాటికి పోటీగా పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారని జనసేన కార్యకర్తలు అంటున్నారు.