Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. టీడీపీ నేత ఓబులాపురం రాజశేఖర్ ను పార్టీ అభ్యర్ధిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మృతితో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ పై 40వేల పైచిలుకు మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య విజయం సాధించారు. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28న మృతి చెందారు. వెంకట సుబ్బయ్య మృతి చెంది ఆరు నెలలు కావస్తున్నందున ఈ నెల రెండవ వారం లోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉంది.
దీంతో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. శుక్రవారం కడప జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బద్వేల్ లో గడచిన ఎన్నికల్లో పరాజయం పాలైన రాజశేఖర్ కే మళ్లీ టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి భూపేశ్ రెడ్డికి బద్వేల్ ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
కాగా దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు భార్యృ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైసీపీ వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ ఖరారు చేస్తుందా లేక వేరే నాయకుడికి టికెట్ ఇస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి ప్రజా ప్రతినిధి అకాల మరణం చెందితే రాజకీయ పార్టీలు వారి కుటుంబ సభ్యులకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఏపిలో బద్వేల్ తో పాటు తెలంగాణలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఉప ఎన్నిక జరగనుండటంతో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కబోతున్నది. టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి పార్టీ క్యాడర్ ను ఉప ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నది. దీంతో రెండు మూడు రోజుల్లో అధికార వైసీపీ కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
1.Vijaya Sai Reddy: మాన్సాస్ అవినీతిపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి..!!
2.Toll Issue: టోల్ ఫీజు విషయంలో మాజీ కలెక్టర్ గొడవ..!