ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్ – 3 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించేందుకు నాలుగేళ్లుగా ఇస్త్రో శాస్త్రవేత్తలు అవిశ్రాంత కృషి నేపథ్యంలో తొలి దశ విజయవంతంగా పూర్తి అయ్యింది. దీంతో శాస్త్రవేత్తల కరతాళ ధ్వనుల మధ్య ఆనందం అంబరాన్నంటింది. నింగికేగిన చంద్రయాన్ – 3 యావత్ భారతాన్ని సంభ్రమశ్చర్యంలో ముంచేస్తూ బారత కీర్తి పతాకను దశదిశలా చాటింది. మూడు దశలు పూర్తి చేసుకుని విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. జాబిల్లి లోని రహస్య జాడలను కనుక్కునేందుకు చంద్రయాన్ – 3 నింగిలోకి దూసుకువెళుతొన్న దృశ్యాలు యావత్ భారత జాతిని సంభ్రమాచ్చర్యాల్లో ముంచేశాయి.
స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత పెంచే .. చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో వర్గాల్లో ఆనందం వెల్లువెత్తింది. చంద్రయాన్ – 3 ఉప గ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ఎల్వీఎం – 3 ఎం 4 రాకెట్ ప్రవేశపెట్టింది. శ్రీహరికోట షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాండ్ ప్యాడ్ నుండి ఎల్వీఎం – 3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకువెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్ కు తరలివచ్చారు. చంద్రయాన్ – 2 లో జరిగిన తప్పిదాలు ఈ సారి జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
చంద్రయాన్ – 3 బడ్జెట్ అంచనా వ్యయం రూ.613 కోట్లు. 3,900 కిలోల బరువు గల చంద్రయాన్ – 3..ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడి దక్షిణ దృవంలో ల్యాండింగ్ అవుతుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. రాకెట్ ప్రయోగం విజయవంతం అవ్వడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ రాకెట్ ప్రయోగం విజయవంతమైందనీ, త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామని చెప్పారు.
MLA Raja Singh: మంత్రి హరీష్ రావుతో ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ .. కారెక్కేందుకేనా అంటూ కామెంట్స్