CM YS Jagan: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఏర్పడి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు గత నెల 11వ తేదీ నుండి గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత గడప గడపకు వైసీపీ అనే పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినా ఆ తరువాత మూడేళ్లగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరిస్తూ గడప గడపకూ మన ప్రభుత్వంగా కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే నేతలు, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం అయ్యింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
CM YS Jagan: సీఎం వద్ద నివేదిక
పలు నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత నివేదిక అందినట్లు తెలుస్తొంది. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ ప్రభుత్వ కార్యక్రమంలో ఎవరెవరు చురుగ్గా పాల్గొంటున్నారు..? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి..? ప్రజల నుండి ఎటువంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది..? అనే విషయాలపై సీఎం జగన్ కు ఒక నివేదిక అందిందని అంటున్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ..
ఈ నేపథ్యంలో రేపు (బుధవారం) తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ చార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఈ వర్క్ షాపులో పాల్గొననున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వస్తున్న స్పందన, సమస్యల పరిష్కారం తదితర విషయాలపై సమీక్ష నిర్వహించి మరింత సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.