Srikalahasti (chittoor): ఏపిలోని శ్రీకాళహస్తిలో వేంచేసి ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ద శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో భక్తులకు నిత్య అన్నదానం సదుపాయం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన మండవ రాంబాబు, కల్పన కుటుంబ సభ్యులు సోమవారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో నిత్య అన్నదాన పథకానికి విరాళం అందజేశారు. వీరు రూ.51,116 ల విరాళాన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజారు తారక శ్రీనివాసులుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.