పిల్లల తల్లిదండ్రులు ఈ ఘటన చూసి అయినా వారి పట్ల జాగ్రతగా ఉండాలనే విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు పలు ప్రాంతాల్లో పిల్లలు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. చిన్న పిల్లలు ఎటు వెళుతున్నారో, ఏమి చేస్తున్నారో తెలియక ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. కాకినాడ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. కాజులూరు మండలం కోలంక గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. కారు డోర్ లాక్ అవ్వడంతో ఓ బాలిక మృతి చెందింది. ఇంటి సమీపంలో అడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి .. దగ్గరలో పార్క్ చేసిన కారులో కి వెళ్లి డోర్ వేసుకుంది.
అయితే కారు డోర్ లాక్ పడటంతో ఎలా డోర్ తెలవాలో తెలిక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో కారులో గాలి అందకపోవడంత చిన్నారి స్పృహ కోల్పోయింది. బయటకు వెళ్లిన పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా ఆచూకి లభించలేదు. చివరికి ఇంటి పక్క న కారులో కొనఊపిరితో బాలికను గుర్తించి స్థానికులు హాటాహుటిన యానాం ఆసుప్రత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్ల వైద్యులు దృవీకరించారు.
ఏడాది క్రితం బాలిక తండ్ర మరణించగా, బాలికతో పాటు పదేళ్ల కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్ పోషించుకుంటోంది. తాజాగా కూతురు ప్రాణాలు కోల్పవడం తో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా రోధిస్తొంది. ఈ ఘఠన చూపరుల హృదయాలను కలచివేసింది. ఈ ఘటనలో గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Wrestlers Protest: డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ అందుకు సిద్దమేనంటూ కీలక వ్యాఖ్యలు