Breaking: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఈరోజో రేపో కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. వైఎస్ షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ సూచనల మేరకు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసినట్లు గా తెలుస్తొంది. షర్మిల నియామకానికి సంబంధించి హైకమాండ్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుండి తప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని భావించిన షర్మిల.. పార్టీ పెద్దలతో పలు దఫాలు చర్చలు జరిపారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల యాక్టివ్ అయితే దాన్ని బీఆర్ఎస్ అవకాశం గా తీసుకునే పార్టీపై దుష్ప్రచారం చేసే ప్రమాదాన్ని ఊహించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ టీపీ విలీన ప్రక్రియను వాయిదా వేయించారు.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఆ క్రమంలోనే ఇటీవల షర్మిల ఢిల్లీకి వెళ్ల రాహుల్, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు గా ప్రకటించారు. షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా నిన్న మణిపూర్ లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంకేతాలు ఇచ్చినట్లుగా సమాచారం. ఆ క్రమంలో గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో షర్మిలకు లైన్ క్లీయర్ అయ్యింది. ఇక షర్మిల నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులే తరువాయి.
YS Sharmila: వైఎస్ షర్మిల కు ఏపీ పీసీసీ పగ్గాలు..మూహూర్తం ఫిక్స్..?