TDP Vs Kodali: కృష్ణాజిల్లా గుడివాడలో పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రా కదలిరా పేరుతో ఇవేళ గుడివాడలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్నారు. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో సభను ఏర్పాటు చేశారు.
ఇవేళ నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు నివాళులర్పించి.. ఆ తర్వాత గుడివాడ సభలో పాల్గొంటారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి వెనిగళ్ల రాము ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరో పక్క వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఎన్టీఆర్ 2 ఎన్టీఆర ఫ్యాన్స్ పేరుతో కొడాలి నాని ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. 300 బైక్ లతో ర్యాలీ, పది వేల మందికి అన్నదానం తదితర కార్యక్రమాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పట్టణ ప్రధాన రహదారులపై టీడీపీ బ్యానర్ లకు పోటీగా, సీఎం వైఎస్ జగన్ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఒక వైపు టీడీపీ .. మరో వైపు వైసీపీ ఫ్లెక్సీలతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఇటీవల వంగవీటి రంగా వర్థంతి కార్యక్రమాల్లో వైసీపీ వర్గాలు గొడవ చేశాయి. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి.
NTR Death Anniversary: బాలయ్య వచ్చి వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు కలకలం