NTR Death Anniversary: నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 28వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు, అభిమానులు నివాళులర్పించారు. అయితే ఎన్టీఆర్ ఘాట్ కు నందమూరి బాలకృష్ణ వచ్చి వెళ్లగానే అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం కలకలాన్ని రేపింది.
నందమూరి బాలకృష్ణ ఉదయమే ఘాట్ కు చేరుకున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు. బాలయ్యతో పాటు సుహాసిని, రామకృష్ణ కూడా ఎన్టీఆర కు నివాళులర్పించారు.
బాలయ్య కంటే ముందే వేకువజామునే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ .. ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తాతయ్య సమాధి పై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. వీరి రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే బాలయ్య వచ్చి వెళ్లగానే ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించడం వివాదాస్పదం అయ్యింది.
టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయిన సందర్భంలో అనేక మంది స్పందించగా, జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో అప్పటి నుండి చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ వాదనలకు బలం చేకూరేలా బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద నుండి తొలగించడంతో టీడీపీకి, జునియర్ ఎన్టీఆర కు మధ్య గ్యాప్ పెరుగుతోందా అనే చర్చ మొదలైంది.
ఓ న్యూస్ ఛానల్ లో ప్రసారమైన వీడియోలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తన అనుచరులతో ‘ఇప్పుడే ..తీయించేయ్’ అంటున్నట్లుగా ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్లగానే ఫ్లెక్సీలను తొలగించడంతో ఇప్పుడు ఆయన అన్నమాటలు వాటిని ఉద్దేశించే అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
YSRCP: నేడో రేపో వైసీపీ నాల్గవ జాబితా .. 25 నుండి సీఎం జగన్ క్యాడర్ తో సమావేశాలు