NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: క‌రోనా టెన్ష‌న్‌లో కేసీఆర్ కు మ‌ళ్లీ అదే షాక్ త‌గిలింది…

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు క‌రోనా టైంలో హైకోర్టు కేంద్రంగా వ‌స్తున్న ప్ర‌శ్న‌ల వ‌ర్షం మ‌ళ్లీ ఎదురైంది. కరోనా థర్డ్ వేవ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు సరిగ్గా లేకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుని కొన్ని సూచనలు చేసిందని, వాటిని కూడా అమలు చేయడంలేదని, ఇక థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించింది. అయితే, ప్ర‌భుత్వం మాత్రం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది.

Read More : Corona: షాక్ఃక‌రోనా టీకా ప‌నిచేయ‌డం లేద‌ని కేసు పెట్టాడు

హైకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం…

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన బెంచ్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజారోగ్య డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా అందించిన నివేదికలను హైకోర్టు పరిశీలించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడంలేదని నిలదీసింది. ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు, ఇకపైన తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పూర్తి వివరాలు లేవని పేర్కొంది. కరోనా కట్టడి కోసం, ప్రజలకు ఎదురయ్యే కష్టాల పరిష్కారం కోసం, ఇబ్బందులను తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహా కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పినా ఇంకా ఆ దిశగా ఏర్పాట్లు కూడా లేవని గుర్తుచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో టెస్టుల సంఖ్యను పెంచడం కీలకమని, కొత్తగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేసే లాబ్‌‌లను నెలకొల్పాలని సూచించినా ఇంకా అందుబాటులోకి ఎందుకు రాలేదని ప్రశ్నించింది.

Read More : Corona: క‌రోనా విష‌యంలో కేంద్రం ముచ్చ‌ట న‌మ్మేలా లేదు… ఓవైసీ సంచ‌ల‌నం…

ప్రైవేట్ ఆస్ప‌త్రుల విష‌యంలో క‌న్నెర్ర‌….

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల కోసం గరిష్టంగా ఎంత ఛార్జి చేయవచ్చునో ప్రభుత్వం కొత్తగా జీవోను జారీ చేయాలని హైకోర్టు గత విచారణ సందర్భంగా సూచించినా ఇప్పటికీ అలాంటి ఉత్తర్వులు ఎందుకు వెలువరించలేదని ప్రశ్నించింది. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకే తరహా చికిత్స ఛార్జీలు ఉండాలని చెప్పినా అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్ కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారని, ఆస్తులు అమ్ముకుంటున్నారని, ఇంత ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ, ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులను జారీ చేశామని అందులో పది ఆసుపత్రులకు కరోనా చికిత్స కోసం ఇచ్చిన అనుమతులను రద్దుచేసినట్లు తెలిపారు. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలను పెంచుతున్నట్లు తెలిపారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N