NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Mudragada Padmanabham: ముద్రగడ సరికొత్త నిర్ణయం.. జగన్ మీద రివర్స్ అవ్వబోతున్నాడా..!

Mudragada Padmanabham: కాపు ఉద్యమానికి, క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించిన ముద్రగడ పద్మనాభం కొద్ది రోజులుగా లేఖాస్త్రాలు సంధిస్తూ యాక్టివ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల దళిత, బీసీ, కాపు నేతలతో ముద్రగడ సమావేశం ఏర్పాటు చేయడంతో ఉమ్మడి కార్యాచరణలో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరేలా రాజ్యాధికారం కోసం రాష్ట్రంలోని దళిత, బీసీ, కాపులు ఐక్యం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు ముద్రగడ. దళిత, బీసీ, కాపు సోదరులను చైతన్యపర్చడానికి ఈ లేఖ రాస్తున్నట్లు ముద్రగడ పేర్కొన్నారు.

Mudragada Padmanabham public letter
Mudragada Padmanabham public letter

Read More: CM YS Jagan Delhi Tour: జగన్‌కు ఢిల్లీలో ఒకరిద్దరు కాదు ఆరుగురు కేంద్ర మంత్రులు చెప్పిన గుడ్ న్యూస్ ఇదే..? ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్..!!

Mudragada Padmanabham: అధికారాన్ని గుంజుకోవాలి

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందే కానీ మన జాతులకు మాత్రం రాలేదని ముద్రగడ అన్నారు. ఇంత కాలంగా రాజ్యాధికారాన్ని వారు వారే అనుభవించారు. అనుభవిస్తున్నారనీ, అధికారాన్ని గుంజుకోవాలే తప్ప బిక్షం వేయమని అడిగినా వేయరని అన్నారు. తక్కువ జనాభా కల్గిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి, ఎక్కువ జనాభా కల్గిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయాలన్నారు. ఎంత కాలం ఇలా పల్లకీలు మోయాలో తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసర వచ్చిందన్నారు. ఇతర గౌరవ బీసీ మరియు దళిత నాయకులు సహకారం తీసుకుని బ్లూ ప్రింట్ తయారు చేద్దామని ముద్రగడ పేర్కొన్నారు.

 

ఇదీ ముద్రగడ రాజకీయ వ్యూహం

అయితే ముద్రగడ రాజకీయ వ్యూహంపై పలు రకాల వాదనలు వినబడుతున్నాయి. రాష్ట్రంలో జనసేన – టీడీపీ రాబోయే ఎన్నికల నాటికి పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాపు సామాజికవర్గం ఆ కూటమికి దగ్గర కాకుండా ఉండేందుకే కొత్త రాజకీయ పార్టీని తెరపైకి తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కాపు రిజర్వేషన్ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ముద్రగడ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు రిజర్వేషన్ పై ఊసే ఎత్తలేదు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశమే లేదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేసినా నోరు మెదపలేదు..ప్రభుత్వంపై ఉద్యమాన్ని ప్రకటించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ కాపు సామాజికవర్గం వైసీపీకి కాపుకాసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే పనిలో జనసేన నిమగ్నమై ఉండగా, ముద్రగడ..దళిత, బీసీ, కాపు సోదరులు అంటూ ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముద్రగడ రాజకీయ వ్యూహం వైసీపీకి వ్యతిరేకంగానా..? లేక టీడీపీ – జనసేనను దెబ్బతీయడానికా..? లేక నిజంగానే రాజ్యాధికారం కోసమా అనేది మీరు గెస్ చేయండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N