Supreme Court: స్కిల్ డెవలప్ మెంట్ కేసు అక్రమమని, తనపై ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుంది.
జస్టిస్ అనిరుద్ద భోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది వేర్వేరుగా తీర్పులను వెల్లడించారు. ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టం 17 ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నట్లు చెప్పారు.
ముందుగా అనిరుద్ద బోస్ వెల్లడించిన తీర్పులో స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని, చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. గతంలో జరిగిన దర్యాప్తునకు ఈ అరెస్టునకు వర్తింపజేయరాదని అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ అరెస్టు కొట్టేయలేమని, అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదని అభిప్రాయపడ్డారు.
జస్టిస్ బేలా ఎం త్రివేది ఆ తీర్పును విభేధిస్తూ. ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించదని, 2018 లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేమని అన్నారు. 2018 లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమేననీ, అవినీతి నిరోధక చట్టానికి 17ఏ ను ముడిపెట్టలేమని అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17 ఏ రక్షణగా ఉండకూడదని, అవినీతి నిరోధక చట్టం లో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్షసాధింపు కు గురి కావద్దని మాత్రమేనని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రతిష్టలో మరో వివాదం