వరుసగా జరుగుతున్న దురదృష్టకర పరిణామాల వల్ల ఏపీ andhra pradhesh లో ఇప్పుడు రాజకీయం హాట్ హాట్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.
విజయనగరం జిల్లా రామతీర్థం ramatheertam లో కోదండరాముడి విగ్రహం ధ్వంసం ఘటన ఇప్పుడు ఏపీ ap లో కాకరేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో నేడు మరింత హాట్ హాట్ పరిణామాలు జరగడం ఖాయమంటున్నారు.
సీఎం జగన్ cm jagan గురించి సంచలనం…
ఏపీలో దేవాలయాల కేంద్రంగా జరుగుతున్న ఉదంతాల గురించి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాస్ tdp polit bureau member kaluva srinivas సంచలన కామెంట్లు చేశారు. ఏపీలో ఆందోళనకరమైన వాతావరణం ఉందని, మెజార్టీ ప్రజల మనోభావాలను దారుణంగా సీఎం జగన్ cm jagan దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. రాముడు తల తీసేయడం అనాగరికమైన చర్య. ఈ దుర్ఘటనల వెనుక ఎవరున్నారో తేలాలి. బ్రిటీష్ కాలంలో కూడా దేవాలయాలపై ఈ స్థాయిలో దాడులు జరగలేదు అని కాలువ శ్రీనివాస్ పేర్కొన్నారు. “ఏపీ సీఎం, హోం, డీజీపీలు క్రైస్తవులు. ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు హిందూ మతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం లేదు. మంత్రులు కొడాలి నాని kodali nani వ్యాఖ్యలను సీఎం జగన్ cm jagan ఎందుకు ఖండించ లేదు. ప్రభుత్వ విశృంఖలత్వం రాముని శిరచ్ఛేధనం దాకా తెచ్చింది“ అని వ్యాఖ్యానించారు.
జనసేన , బీజేపీ సంచలన నిర్ణయం sensational decision of janasena , bjp
మరోవైపు.. రామతీర్థం ధర్మ యాత్ర పేరుతో నిరసన కార్యక్రమానికి జనసేన, భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. నేడు రామతీర్థం ధర్మ యాత్రకు సిద్ధం కావాలంటూ ఇరు పార్టీలు పిలుపునిచ్చాయి.. దేవాలయాల విషయంలో వైసీపీ ysrcp సర్కార్ ఉదాసిన వైఖరిని నిరసిస్తూ ధర్మయాత్రకు పూనుకున్నట్టు ప్రకటించారు. ఆలయాలు, విగ్రహాలపై వరుస ఘటనలే.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని ఇరు పార్టీల నేతలు ఆరోపిస్తున్నాయి. ఉదయం 11 గంటలకు రామతీర్థం చేరుకోవడానికి ఇరు పార్టీలు ప్రణాళికను సిద్ధం చేశాయి. బీజేపీ నుండి సోమువీర్రాజు somu verraju, ఎమ్మెల్సీ మాధవ్, ఇతర ముఖ్య నేతలు, జనసేన janasena పార్టీ నుండి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ముఖ్య నాయకులు ధర్మయాత్రలో పాల్గొననున్నారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్పీ సంచలనం ….
రామతీర్థం ramatheertam ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ ఘటన పై సీఐడీ విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం సీ ఐ డీ విచారణకు ఆదేశించగా ఎస్పీ కీలక ప్రకటన చేశారు. రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రస్తుతం దేవస్థానం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 12 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ రాజకుమారి ఇప్పటికే వెల్లడించారు. ఈ అరాచకానికి పాల్పడ్డ దుండగులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకొని శిక్షిస్తామన్నారు.