ఏపి సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టెక్ మహేంద్ర ఎండీ, సీఈఓ సిపీ గర్నాని సమావేశమైయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన ముందుగా సీఎం జగన్ సత్కరించారు. అనంతరం జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గర్నానీని సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అఁదజేశారు. ఇటీవల దావోస్ పర్యటనలో టెక్ మహేంద్ర సీఇఓ గర్నానితో సమావేశమైన సీఎం జగన్ ఏపిలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో సింగిల్ విండోలో అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సమయంలోనే సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిపై ఆంధ్రా వర్శిటీలో కలిసి పని చేయడానికి నిర్ణయించుకున్నట్లు గర్నాని వెల్లడించారు.
నైపుణ్యాలను పెంచేందుకు హై ఎండ్ టెక్నాలజీ పై వచ్చే మూడు నెలల్లో కలిసి పని చేస్తామని, ఆంధ్రా వర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక రూపొందిస్తామని తెలియజేసిన గర్నాని నేడు సీఎం జగన్ తో సమావేశమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖను మేజర్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం జగన్ సాఫ్ట్ వేర్ సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నారు. దావోస్ లో కలిసిన తరువాత రెండు నెలల వ్యవధిలోనే టెక్ మహేంద్ర ఎండీ గర్నాని ఏపికి వచ్చి సీఎం జగన్ తో భేటీ కావడం శుభపరిణామంగా భావిస్తున్నారు.