KCR: దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాం హౌస్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని వెల్లడించారు.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు…
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణ సంధర్భంగా 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టీస్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని పేర్కొన్న హైకోర్టు ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్ లో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని ఎవరినైనా నియమించాలని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్లో కీలక నిర్ణయం
ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీలో కోవిడ్ కంట్రోల్ రూమ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈరోజు జీహెచ్ఎంసీ నగర పారిశుధ్య కార్యక్రమాల మీద ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు జోనల్, డిప్యూటీ కమిషనర్, ఏ.ఎం.హెచ్.ఓ లు హాజరయ్యారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులను సహించేది లేదన్న ఆయన మరికొద్ది రోజుల్లో వర్షాలు ఆరంభమవుతున్న దృష్ట్యా రహదారులపై పూర్తిస్థాయిలో గార్బేజ్ ను ప్రతిరోజు తొలగించడం ద్వారా అంటువ్యాధులు, కరోనా వ్యాప్తిని నివారించాలని ఆదేశించాలి. నగరంలో గార్బేజ్ తొలగింపు అనేది ప్రాథమిక విధి అని, వీటిని పూర్తిస్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా పరిస్థితుల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దన్న ఆయన ప్రతిరోజు ఉదయం 6 గంటల లోపే క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ పర్యవేక్షించాలని డిప్యూటీ కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించని అధికారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.