Disha Patani: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన “లోఫర్” సినిమాలో జత కట్టి సందడి చేసిన దిశా పటాని అందరికీ బాగా గుర్తు ఉండే ఉంటుంది.ఈ సినిమా తర్వాత పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు మత్తెక్కిస్తుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న దిశాపటాని సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికే ఏకంగా 16 మిలియన్ల వ్యూస్ సాధించిందంటే ఆ ఫోటో ఏ రేంజ్ లో ఉందో మనకు ఇట్టే తెలిసిపోతుంది. మరి అంత గ్లామరస్ ఫోటోను మీరు ఓ లుక్కేయండి.
దిశా పటాని, మాల్దీవులు:
దిశాపటాని హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ లో బికినీ ధరించి మోకాళ్లపై కూర్చుని ఉంది. ఆమె మొహం పై సూర్యకాంతి పడుతున్న వెలుగులో బంగారు వర్ణంలో మెరిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ.ఈ ఫోటోని షేర్ చేస్తూ దిశాపటాని ఎటువంటి క్యాప్షన్ ఇవ్వకపోయినా ఈ ఫోటో చూసిన నెటిజన్లు క్రియేటివిటీ ఆధారంగా తమదైన శైలిలో క్యాప్షన్ జోడించి కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో కుర్రకారులను ఏవిధంగా మత్తెక్కిస్తోందంటే ఈ ఫోటో షేర్ చేసిన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 16 మిలియన్ వ్యూస్ ని సాధించిందంటే ఏ రేంజ్ లో నెటిజన్లను ఆకట్టుకుందో తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ నటిస్తున్న “రాధే” సినిమాతో పాటు,’ఏక్ విలన్’ సీక్వెల్ ‘ఏక్ విలన్ రిటర్స్’వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!