Tirupathi : భారత్ – పాక్ యుద్ధంలో విశేష సేవలు అందించి మహావీర చక్ర, పరమ విశిష్ఠ సేవా పురస్కారాలు అందుకున్న యుద్ధవీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి వేణుగోపాల్ Venugopal ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ys jagan mohan reddy ఘనంగా సత్కరించారు. స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి చేరుకున్న సీఎం జగన్ ముందుగా వేణుగోపాల్ నివాసానికి వెళ్లి పరామర్శించి ఘనంగా సత్కరించారు. 1971లో భారత్ – పాక్ యుద్ధంలో వేణుగోపాల్ పాల్గొని విశేష సేవలు అందించారు. ఇప్పుడు ఆయన వయసు 95 ఏళ్లు.
భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వప్నిమ్ విజయ్ వర్ష్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 16న ఢిలీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద వెలిగించిన విజయ్ జ్వాల (విక్టరీ ఫ్లేమ్) బుధవారం తిరుపతి చేరుకోగా ఏవోసీ సెంటర్ కమాండెంట్ బ్రిగేడిర్ జేజేఎస్ బిందర్ సైనిక గౌరవాలతో అందుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నేటి సాయంత్రం సీఎం జగన్ దీన్ని స్వీకరించారు. అనంతరం పలువురు యుద్ధవీరులను జగన్ సత్కరించారు.
ఈ కార్యక్రమాల్లో జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, డీజీపీ గౌతం సవాంగ్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.