Sarkaru vari pata : సర్కారు వారి Sarkaru vari pata పాట ప్రస్తుతం దుబాయ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కుతుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న ఈ తాజా షెడ్యూల్ లో మహేష్ బాబు – కీర్తి సురేష్ ల మీద కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురాం. అలాగే ఇద్దరి మీద ఒక సాంగ్ కూడా కంప్లీట్ చేస్తారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2022 జనవరి 14 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో సర్కారు వారి పాట ని దర్శకుడు పరశురాం రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నాడు. ‘దూకుడు’ ‘బిజినెస్ మ్యాన్’ ‘ఆగడు’ సినిమాల తర్వాత మళ్ళీ మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Sarkaru vari pata : ఆగస్ట్ లో సర్కారు వారి పాట నుంచి సాలీడ్ అప్డేట్ ఇవ్వబోతునట్లు థమన్ తెలిపాడు.
ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ సినిమా సర్కారు వారి పాట. అందుకే థమన్ అదిరిపోయో ఆల్బం ని రెడీ చేస్తున్నాడట. అంతేకాదు దర్శకుడు పరశురాం కూడా పూర్తిగా థమన్ తో కలిసి ట్యూన్స్ ఫైనల్ చేస్తున్నాడట. కాగా ఆగస్ట్ లో సర్కారు వారి పాట నుంచి సాలీడ్ అప్డేట్ ఇవ్వబోతునట్లు థమన్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ట్విట్టర్ లో ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి అప్డేట్ అడిగిన ఫ్యాన్ కి రిప్లై ఇచ్చిన థమన్ ‘మనకు ఇంకా చాలా టైం ఉంది బ్రదర్.. ఈసారి బుల్లెట్ కరెక్టుగా దింపేద్దాం.. అదైతే ఫిక్స్.. 2020 సంక్రాంతి రిలీజ్ కదా.. ఆగస్ట్ లో కలుద్దాం’ అని ఇన్డైరెక్ట్ గా ఆగస్టులో సర్ప్రైజ్ ఉండబోతుందని వెల్లడించాడు. ఇలా థమన్ ఇచ్చిన హింట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!