anandayya: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేందుకు సమయం తీసుకుంటోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ లో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి నమ్మవద్దన్నారు.
Read More: Lock down : తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు?
ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు …
తన నియోజకవర్గం అయిన జగిత్యాల ప్రభుత్వ ఆ స్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. జగిత్యాల నుంచి కొందరు కృష్ణపట్నం వెళ్లి మందు తీసుకొచ్చి కళ్లల్లో వేసుకోగా అది కళ్ల మంటకు కారణమైంది కానీ కరోనా ఏమాత్రం తగ్గలేదన్నారు. కృష్ణపట్నం ఆనందయ్య మందు మంచిగా పనిచేస్తే జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న 45 మంది పేషెంట్స్ కి అదే మందు వేసి కరోనా తగ్గించేవాళ్లమన్నారు. ఎమ్మెల్యేగా,కంటి వైద్యుడిగా చెబుతున్నా.. ఇంత శాస్త్రీయమైన వైద్యసదుపాయాలు, పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక కూడా ఈ నాటు పద్ధతులను ఇంకా ప్రజలు నమ్మడం దురదృష్టకరమని సంజయ్ కుమార్ అన్నారు.
Lock down : KCR: గ్రాప్ పెంచుకున్న కేసీఆర్…గాలి తీసేస్తున్నది ఎవరంటే….
హైకోర్టులో విచారణ
కరోనా కు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆనందయ్య మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని, ఆనందయ్య ఉపయోగిస్తున్న మందుపై పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ల్యాబ్ ల నుంచి ఈనెల 29న రిపోర్టులు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు ఆనందయ్య మందు కావాలని కోరుతున్నారని, భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వీలైనంత త్వరగా రిపోర్టులు తెప్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలిచ్చిందని ప్రస్తావించిన పిటిషనర్ తరపు న్యాయవాది, లోకాయుక్త ఏకపక్షంగా ఎలా ఆదేశాలు ఇస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.