TTD: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని ఇదే క్రమంలో ఆర్ధిత సేవల టికెట్ల ధరలు కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది. విఐపీ సిఫార్సు లేఖల ద్వారా కల్పించే సేవలను పెంచుతూ టిటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాత సేవ రూ.2వేలు, తోమాల, అర్జన సేవ రూ.5వేలు, కల్యాణోత్సవం రూ.2,500లుగా నిర్ణయిస్తున్నట్లు సమాచారం. వేదపండితుల చేత ఆశీర్వచనం పదివేలుగా నిర్ణయించనున్నారు. టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం తిరుమల అన్నమయ్య భవన్ లో పాలకమండలి సమావేశం జరిగింది. సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవ టికెట్ల ధరల పెంపుపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ నెలాఖరులోగా తిరుమలలో సాధారణ పరిస్థితులు తెస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పారు.
TTD: పాలక మండలి ఆమోదించిన తీర్మానాలు ఇవే
- రూ.230 కోట్లతో పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి అమోదం
- రూ.టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలకు రూ.25 కోట్లు
- అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్ ప్లాంట్ ఏర్పాటు
- రూ.2.73 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి అధునీకరణ
- కొండపైన అన్ని ప్రదేశాల్లో అన్న ప్రసాదం అందించేందుకు చర్యలు
- తిరుపతి సైన్స్ సెంటర్ భూమిలో 50 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
- తిరుపతిలో 50 ఎకరాల్లో ఆథ్యాత్మిక నగరం ఏర్పాటు
- వీలైనంత త్వరగా అన్నమయ్య మార్గం ఏర్పాటు
- అటవీశాఖ అనుమతి వచ్చేలోగా తాత్కాలిక పనులు
- ప్రస్తుతం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా నడకదారి ఏర్పాటు
- మహాద్వారం, ఆనంద నిలయం, బంగారు వాకిలికి బంగారు తాపడం వేయాలని నిర్ణయించారు.