ఇదేం లెక్కోగాని అంతా చాలా చిత్ర విచిత్రంగా ఉంది. కొన్ని జాతీయ మీడియా సర్వే సంస్థలు అయితే గత మూడు సంవత్సరాలుగా వైసీపీకి ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలకు గాను 25 పార్లమెంటు స్థానాలు వస్తాయి అంటూ మూడేళ్లుగా ఒకటే చెబుతూ వస్తున్నారు. విచిత్రం ఏంటంటే గత ఏడాది 25 పార్లమెంటు స్థానాలకు 24 చోట్ల వైసీపీ గెలుస్తుందని చెప్పిన సదరు జాతీయ మీడియా సర్వేలు.. ఈ యేడాది సంక్రాంతి తర్వాత 24 సీట్లు లేదా 25 కు 25 గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదని నెంబర్లు చెప్పారు.
రెండు జాతీయ మీడియా సర్వే సంస్థలు వైసీపీకి ఏకంగా 22 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని లెక్కలు వేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని చెప్పుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చాక జాతీయ మీడియా సంస్థలతో పాటు స్థానిక సర్వే సంస్థలు కూడా ప్లేటు తిప్పేస్తున్నాయి. ఈ నెల మొదట్లో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ప్రకారం చేసింది. అందులో వైసీపీకి 15 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. వెంటనే నీలి, కూలి మీడియా అందుకుని జగన్కు ఎదురులేదని చెప్పుకోవడం ప్రారంభించారు.
ఎన్నికల కోడ్ రాగానే ఇదే ఇండియా టీవీ ప్లేట్ ఫెరాయించేసింది. మరో సర్వే ప్రకారం చేసింది. అందులో ఒక టీడీపీకే 14 పార్లమెంటు స్థానాలు, జనసేనకు రెండు, బీజేపికి రెండు సీట్లు వస్తాయని వైసీపీకి కేవలం ఏడూ లేదా ఎనిమిది సీట్లు వస్తాయని తేల్చింది. ఈ సర్వే చూసిన తర్వాత వైసీపీ వాళ్లకు కూడా నీరసాలు వస్తున్నాయి. ఇక ఈ టీజీ పేరుతో జగన్కు, వైసీపీకి పాతికకు పాతిక సీట్లు వేసే కంపెనీ తాడేపల్లిలో పుట్టింది. ఈ కంపెనీ కూడా ఇటీవల సర్వే నంబర్లు మారుస్తోంది.
మొదట్లో పాతిక సీట్లు వేసే కంపెనీ తర్వాత 17 వేస్తూ వస్తుంది. రేపు మళ్లీ వేయాల్సి వస్తే ఎన్ని సీట్లు వేస్తుందో అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. ఏది ఏమైనా కోడ్ వచ్చేవరకు వైసీపీకి వన్ సైడ్ గా నెంబర్లు వేసుకుంటూ వచ్చిన జాతీయ.. స్థానిక మీడియా సర్వే సంస్థలు ఇప్పుడు ప్లేటు ఫిరాయించి తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు 50 రోజులకు పైగా టైం ఉంది. అప్పటికి ఇంకెన్ని సీట్లు తగ్గిస్తాయో అన్నది చూడాలి.