YCP MP Vijayasai Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. నామినేషన్ల పర్వానికి ముందే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన నారా చంద్రబాబు ఆనాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న నేపథ్యంలో ఆ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అయితే తెలంగాణ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకి అధికారికంగా మద్దతు ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ. దీంతో టీడీపీ సానుభూతిపరులు, నేతలు అక్కడి స్థానిక పరిస్థితుల మేరకు వారికి నచ్చిన నాయకులకు మద్దతు తెలియజేస్తూ ఆయా పార్టీల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పోటీ చేస్తొంది. అయితే గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ జండాలతో అక్కడి కార్యకర్తలు పాల్గొంటున్నారు.
నిన్న (శనివారం) ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఆ ప్రచారంలో పలువురు టీడీపీ జెండాలతో పాల్గొన్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు, దగ్గుబాటి లను మరో సారి విమర్శించారు. ప్రియాంక గాంధీ ర్యాలీలో టీడీపీ వాళ్లు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి ల విలువలు లేని రాజకీయాలకు ఇది నిదర్శనమని అన్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ బాగా ఊదుతున్న పురందేశ్వరి తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కట్టడం పై ఏమంటారో మరి సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.
PM Narendra Modi: నేడు తిరుపతికి ప్రధాని మోడీ .. స్వాగతం పలకనున్న సీఎం జగన్
ప్రియాంక వాద్రా ర్యాలీల్లో టీడీపీ వాళ్ళు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి. చంద్రబాబు గారి , పురంధేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం. బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురంధేశ్వరి గారు తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కట్టడంపై ఏమంటారో మరి! pic.twitter.com/ZbZHvJbj8D
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 26, 2023