YS Jagan : ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహనరెడ్డి ys jagan Mohan Reddy పరిపాలనలో తన మార్కు కనిపించాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా పథకాలను అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ అమలు చేయని పథకాలను మన రాష్ట్రంలో అమలు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలన్నది ఆయన కోరిక కావచ్చు. అందులో బాగంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ సక్సెస్ అయ్యింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బేరీజు వేసుకోకుండా ఫథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం పట్ల ఆర్థిక వేత్తలు తప్పుబడుతున్నారు.
సీఎం జగన్ ఏదేనా అనుకుంటే అధికారులు దాన్ని అమలు చేయాల్సిందే, ఆ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది దాని వల్ల ప్రయోజనం ఎంత, లాభనష్టాలు, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు తదితర విషయాలను అధికారులు కూడా జగన్ కు చెప్పలేని పరిస్థితి,. సీఎం గారు చెప్పారు దాన్ని అమలు చేయాల్సిందే అన్నట్లుగా అధికారులు ఉంటున్నారు తప్ప దీని వల్ల కోట్ల రూపాయలు దండగ అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. జగన్ కొన్ని విషయాల్లో జగమొండిగా వ్యవహరిస్తారనే విమర్శ కూడా ఉంది. తాజాగా జగన్ అమలు చేసి ఓ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా బొక్క పెట్టింది. జగన్మోహనరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలతో పాటు ఆ పార్టీ నేతలు కూడా ఈ పథకం ఎందుకు అన్నట్లు పెదవి విరుస్తున్నారు.
YS Jagan : ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇంటింటికి రేషన్ పంపిణీ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ పథకాన్ని మెజార్టీ ప్రజలకు కూడా ఇష్టంలేదు. ప్రతి నెలా 1వ తేదీ నుండి పదవ తేదీలోపు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అందజేసే బియ్యం, కందిపప్పు, పంచదార వంటి వస్తువులు కార్డుదారులు తీసుకుంటుంటారు. ఉదయం పూట నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటలు రేషన్ షాపులు తెరిచి విక్రయాలు సాగిస్తుంటారు. ఇది ప్రజలకు సౌకర్యవంతంగానే ఉంటుంది. వారికి వీలున్న సమయంలో రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటుంటారు. ఇపాస్ మిషన్ లో పోర్టబులిటీ సౌకర్యం ఉండటం వల్ల వేరే ప్రాంతాల వారు కూడా దగ్గర షాపులో రేషన్ సరుకులుతీసుకునే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఎక్కువగా కూలీ పనులు, పొలం పనులకు వెళుతుంటారు. వీరు ఉదయం వెళ్లి సాయంత్రం వస్తుంటారు. వారికి వీలున్న సమయంలో రేషన్ షాపులో సరుకులు తెచ్చుకుంటారు. రేషన్ కార్డుదారులు ఎవరూ తమ ఇంటికే సరుకులు తెచ్చిఇవ్వాలని ఏమీ కోరలేదు. కానీ జగన్ మాత్రం ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించేశారు.
ఈ ఇంటింటికి రేషన్ పథకం వల్ల వాహనాల కొనుగోలు కోసమే దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి నెలా ఒక్కో వాహన డ్రైవర్ కు రూ.21వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంత ఖర్చు పెట్టి వాహనం ద్వారా రేషన్ సరుకులను ఇళ్లకు పంపినా కార్డుదారులు ఆ సమయంలో ఇళ్లవద్ద లేకపోతే మళ్లీ వాహనం ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. రేషన్ షాపుల వద్ద సరుకులు ఇచ్చే అవకాశం ఉండదు,. పోర్టబులిటీ లేదు. వ్యాన్ వచ్చినప్పుడు కార్డుదారులు ఇళ్లల్లో లేకపోతే వీరు సాయంత్రం గ్రామ సచివాలయం వద్దకు వెళ్లి సదరు వ్యాన్ డ్రైవర్ నుండి రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అమలు చేస్తున్న ఈ పథకంపై మెజార్టీ ప్రజలు పెదవి విరుస్తున్నారు.