YSRCP: వైసీపీ ఆధ్వర్యంలో నేతల సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి ఇవేళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజిక సాధికార బస్సు యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ సీఎం జగన్ వీడియో విడుదల చేశారు. రెండు నెలల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ యాత్ర నిర్వహిస్తూ ప్రజల్లో మమేకం కావాలన్నారు. మన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిదని అన్నారు.
ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించిందన్నారు సీఎం జగన్. 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75 శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనమని అన్నారు. చట్టంచేసి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టంకట్టిన ప్రభుత్వం కూడా మనదేనని అన్నారు. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. రాబోయే రోజుల్లో కూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందని అన్నారు.
TDP Janasena Alliance: టీడీపీ – జనసేన పొత్తు .. ఆ పెద్దాయన సీటుకు ఎసరు వచ్చినట్లే(నా)..!
ఈరోజు నుంచి వైసీపీ చేపట్టిన “సామాజిక సాధికార యాత్ర’’ ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలి. పేదవాడి విజయానికి బాటలు వేయాలి సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుండి, కోస్తాంధ్రలో తెనాలి నుండి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాల నుండి ఇవేళ నేతలు బస్సు యాత్రలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బస్సు యాత్రల్లో మంత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Telangana Assembly Elections: బీఆర్ఎస్ కు బైబై చెప్పిన మరో ఎమ్మెల్సీ