NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: టీడీపీ అనుకూల మీడియాకు ఫుల్ స్టఫ్ దొరికినట్లుందే..! వైేసీపీ ఆందోళనలు హైలెట్ చేస్తూ వార్తలు..!!

YSRCP: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన నూతన కేబినెట్ ను ప్రకటించారు. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విదంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కులాల ఈక్వేషన్ లో కొందరు ఆశావహులకు అవకాశం కల్పించలేకపోయారు. దీంతో సహజంగానే మంత్రి పదవులు ఆశించిన వారిలో కొంత అసంతృప్తి ఉంటుంది. తమ అభిమాన నాయకుడికి మంత్రి వర్గంలో అవకాశం దక్కకపోవడంతో క్యాడర్ ఆందోళన చెందుతుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినంత మాత్రాన వీళ్లు పార్టీ నుండి బయటకు వెళ్లి ప్రత్యర్ధి పార్టీలో చేరే పరిస్థితి లేదు. నిన్న మొన్నటి వరకూ తిట్టిన పార్టీ నాయకులతో కలిసి స్నేహం చేసే అవకాశం కూడా ఉండదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ నాయకులను పిలిచి మాట్లాడి పార్టీలోనో, ప్రభుత్వంలోనో మంచి పదవి ఇస్తాననీ, ప్రోటోకాల్ తగ్గకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే పార్టీలో అసంతృప్తి టీ కప్పులో తుఫానులా ఆవిరి అవుతుంది.

YSRCP followers protest news in tdp favour media
YSRCP followers protest news in tdp favour media

Read More: YSRCP: మంత్రివర్గ కూర్పుపై వైసీపీలో అసంతృప్తి సెగలు .. ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నిరసనలు.. మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

YSRCP: వైసీపీ నిరసన జ్వాలలు అంటూ

ప్రస్తుతం మంత్రి వర్గంలో చోటు లభించకపోవడంతో రాజీనామా చేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఆయా నేతల అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకు ముందు వైసీపీ నేతలు చేసే ఆందోళనలు, దర్నాలు టీడీపీ అనుకూల మీడియాలో పెద్దగా వచ్చేవి కావు. కేవలం సాక్షి లోనే వైసీపీ నేతల వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇప్పుడు వైసీపీ శ్రేణుల ఆందోళనలు సాక్షిలో కనిపించడం లేదు. కానీ మంచి స్టఫ్ దొరికినట్లు టీడీపీ అనుకూల మీడియా వైసీపీ కార్యకర్తల ఆందోళనలు హైలెట్ చేస్తున్నాయి. వైసీపీ నిరసన జ్వాలలు అంటూ ఆయా నాయకుల అభిమానులు, కార్యకర్తలు చేస్తున్న ధర్నాలు, రాస్తారోకోలను టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేస్తోంది. మంత్రివర్గంలో చోటు లభించిన నేతల అభిమానులు, ఆయా వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ జగన్మోహనరెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న వార్తలు మాత్రం సాక్షిలో ఇస్తుండగా వీటిని టీడీపీ అనుకూల మీడియాలో మచ్చుకైనా చూపడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు జగన్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హర్షాతిరేకాలను సాక్షి హైలెట్ చేస్తోంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N