Bigg Boss 7: బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారం సెప్టెంబర్ మూడో తారీకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే గత సీజన్లకు భిన్నంగా ప్రస్తుత సీజన్ లో చాలా వరకు తెలిసిన ముఖాలు ఉండటంతో.. కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని అభిమానుల నుంచి కామెంట్లు వస్తున్నాయి. దాదాపు 20 వారాలు పాటు ప్రసారం కానుందాన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నది ఎవరు అన్న దాని విషయంలో నటుడు శివాజీ పేరు వినిపిస్తుంది.
బిగ్ బాస్ షో నిర్వాహకులు వారానికి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ కింద ఇవ్వబోతున్నారని టాక్. ఆ తర్వాత షకీలా కు వారానికి మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. వీరిద్దరికీ అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం.. వీళ్లకున్న ఫాలోయింగ్ అట. నటుడు శివాజీ రాజకీయంగా కూడా చాలా యాక్టివ్ అని అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివాజీ.. రాజకీయంగా యాక్టివ్ పాత్ర పోషించారు. సినిమాల పరంగా ఆయన చాలామంది టాప్ హీరోలతో పాటు… చాలా కామెడీ సినిమాలు కూడా చేయడం జరిగింది.
దీంతో శివాజీకి అన్ని లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సమాచారం. ఇంకా షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు శృంగార తారగా సౌత్ ఇండియాలో అనేక సినిమాలు చేయడం జరిగింది. షకీలా అంటే అప్పట్లో పడి చచ్చిపోయే వాళ్ళు. స్టార్ హీరోల సినిమాలకు దీటుగా షకీలా సినిమాలు పోటీ ఇచ్చేవి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెకు కూడా భారీ పారితోషకం ఇస్తున్నట్లు టాక్. మిగతా కంటెస్టెంట్ లందరికీ వారానికి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎక్కువ సంపాదన వదులుకొని హౌస్ లో అడుగుపెట్టిన వారిలో ప్రిన్స్ యావార్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. తో పాటు ఇద్దరు లేడీ కంటెస్టెంట్ అట. బయట వాళ్లకి వచ్చే ఎక్కువ రాబడి వదులుకొని కెరియర్లో గుర్తింపు సంపాదించడం కోసం షోలో అడుగు పెట్టడం జరిగిందంట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!