ప్రస్తుతం తెలంగాణ లో రాజకీయాలు మంచి హీట్ పైన ఉన్నాయి. బిజెపి గత రెండు ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులలో కలకలం మొదలైంది. వీరేమో గెలుపు లో ఉంటే వారు మొట్టమొదటిసారి ఎదురవుతున్న ప్రతిఘటనను తట్టుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ జగిత్యాల పర్యటనలో ఆ ఎఫెక్ట్ కనపడింది…
వారంటే విరుచుకుపడతాడయే…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ సందర్భానుసారంగా కేసీఆర్ కుటుంబంలోని కేటీఆర్, కవిత హరీష్ రావు పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక దుబ్బాక ఎన్నికల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ఇతని నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. కేసీఆర్ పై భారీ ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న సంజయ్ పై బిజెపి నేతలు టిఆర్ఎస్ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో జగిత్యాల లో పర్యటించిన బండి సంజయ్ ను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అతని పర్యటన ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ముందు నుండి ఆందోళన చేపట్టేందుకు రెడీ అయి ఉన్నారు.
ఆ నిధులు రావలసిందే…
అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే… కొత్త డిమాండ్లతో టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ ను అడ్డగించారు. తెలంగాణలోని గ్రామపంచాయతీలో కు రావలసిన రూ. 1024 కోట్ల నిధులతోను విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ నిధులను తమకు ఇవ్వాలని అయితే ఇంకా ఇవ్వలేదని చెప్పి వాటిని తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఫ్లకార్డులతో కూడా ఆ నిధులను డిమాండ్ చేస్తూ ప్రదర్శించారు. దీంతో జగిత్యాల థరూర్ బ్రిడ్జి పైన విపరీతమైన టెన్షన్ నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్ లతో టీఆరెఎస్ నేతలు ఈ నిరసన చేయడం జరిగింది.
తీవ్ర ఉద్రిక్తత…
మరోవైపు బిజెపి నేతలు ఇలా తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ని ఎలా అడ్డుకోవడంతో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంతేకాకుండా వారు ఇలా అడ్డుకోవడానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా చేయడం జరిగింది. నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు జగిత్యాల లో నిర్వహించిన కిసాన్ సమ్మేళన్ లో పాల్గొనేందుకు బండి సంజయ్ వెళ్ళినప్పుడు ఈ గొడవ చోటు చేసుకోవడం గమనార్హం.