ఈ మధ్య కాలం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా, కమెడియన్ గా, ఎమోషనల్ సీన్స్ పండించడంలో తనకంటే ఎవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరనే విధంగా యాక్ట్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు రావు రమేష్. దర్శకుడిగా, నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు రావు రమేశ్. తను నటించే సినిమాలో రావు రమేశ్ వంద శాతం తన పాత్రకు న్యాయం చేస్తారనే చెప్పుకోవచ్చు.
ఏఒక్క లోపం లేకుండా నవరసాలను పండించడంలో ఈయనకు ఈయనే సాటి అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఎమోషనల్ ను పండించడంలో ముందుంటారనే చెప్పుకోవచ్చు. కాని సినీ ఇండస్ట్రీకి తన ఎంట్రీ గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆసక్తి గొలిపేలా ఉన్నాయి. బాలయ్య బాబు హీరోగా నటించిన సీమసింహం మూవీ ద్వారా రమేశ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు.
ఆ తర్వాత వరుస సినిమాలతో రావు రమేశ్ ఒక సెలబ్రీటిగా మారిపోయారు. ఏ పాత్రను ఇచ్చినా అందులో లీనమయ్యి నటించే ఈ యాక్టర్ కి అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనే ఉద్దేశమే లేదంటే ఎవరైనా నమ్ముతారా.. కాని అది నిజంగా నిజమండీ బాబు.. అయితే రావు రమేశ్ కు ఫోటోగ్రఫీపై ఇంట్రెస్ట్ ఉండేదట. దానితో దర్శకుడిగా అవుదామనుకుంటున్నానని తన తల్లికి తెలిపాడట. కాని ఆమె డైరెక్టర్ కావాలంటే కేవలం లెన్స్ గురించి మాత్రమే తెలిస్తే సరిపోదని సమాధానమిచ్చిందట.
అలాగే 24 విభాగాలపైనా పట్టు ఉండాలని జీవితం గురించి పూర్తిగా తెలుసుకోని అడుగువేయాలని చెప్పారట. అలాగే మన ముందున్న ముండ్ల బాటను దాటుకుని వెళ్లిన తర్వాత పూల బాట వస్తుందని వెలుగు కనిపిస్తుందని ఆమె తెలిపారట. అలా రావు రమేశ్ తన తల్లి చెప్పిన విధంగా నటుడిగా అడుగుపెట్టారట. ముఖ్యంగా చెప్పాలంటే తన తల్లి వల్లనే డైరెక్టర్ కు బదులుగా యాక్టర్ అయ్యానని చెప్పుకొచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!