అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సవ్య సాచి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్. ఆ తర్వాత అక్కినేని హీరో అఖిల్ తో మరో సినిమా సినిమా చేసింది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు అక్కినేని హీరోల తో సవ్యసాచి- మిస్టర్ మజ్ను చిత్రాలతో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నిధికి ఆ తర్వాత మాత్రం పెద్దగా కెరీర్ సాగలేదు. అయితే రామ్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధికి పెద్ద బ్రేక్ వచ్చింది.
అయితే ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ కమర్షియల్ సక్సస్ తర్వాత అందరు ఇక నిధి కెరీర్ ని భారీ లెవల్ లో ఊహించుకున్నారు. కాని ఎందుకనో ఇస్మార్ట్ శంకర్ తర్వాత కూడా టాలీవుడ్ లో నిధి కి రావాల్సిన అవకాశాలు రాలేదు. నత్త నడకలా సాగుతోంది. ఘట్టమనేని హీరో అశోక్ గల్ల డెబ్యూ సినిమా లో నిధి హీరోయిన్ గా ఫైనల్ అయినప్పటికి ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ తెలుగు సినిమా ఏదీ సైన్ చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిధి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది.
హాట్ హాట్ ఫోటోలతో యూత్ కి వేడి పుట్టిస్తోంది. కాగా రీసెంట్ గా క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న పీరియాడికల్ సినిమాలో నిధీ కి అవకాశం వచ్చిందని అంటున్నారు. దాదాపు ఫైనల్ అయినట్టు త్వరలో అఫీషియల్ గా నిధి ని అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే నిధి కి టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో బాగా లక్ కలిసొస్తోంది. ఇప్పటికే నిధీ నటించిన తమిళ డెబ్యూ సినిమా ‘భూమి’ రిలీజ్ కి రెడీ అయింది.
కాగా తాజాగా మరో తమిళ సినిమాకి సైన్ చేసింది. ఈ సినిమా ఈశ్వరన్ అన్న టైటిల్ తో తెరకెక్కబోతోంది. ఇక ప్రఖ్యాత రెవెరీ మ్యాగజైన్ కు వేడెక్కించే పోజులివ్వడంతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది నిధీ.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!