Mahesh Babu: విజయ్ దేవరకొండ తో తీసిన గీతాగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 2018వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ గా అనేక రీతులుగా అలరించింది. కాగా అంతకుముందు అనేక సినిమాలు చేసినా గాని గీతా గోవిందం సినిమా తో … తనకంటూ సపరేట్ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ పరుశురాం. వెంటనే ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే కొత్త సబ్జెక్ట్ సినిమా ప్రకటించి అందరి చూపు తనవైపు తిప్పుకున్నడు.
వచ్చే మే నెలలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. పైగా ఈ సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడుతూ… మరో పోకిరి మాదిరిగా ఉంటుందని కామెంట్లు చేయటంతో… అంచనాలు డబల్ త్రిబుల్ అయ్యాయి. ఇదిలా ఉంటే మహేష్ తో ఫ్యాన్స్ అందుకున్న డైరెక్టర్ పరుశురాం ఇప్పుడు మరో బిగ్ స్టార్ హీరోనీ లైన్ లో పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
అతను మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల పరుశురాం స్టోరీ కి సంబంధించిన లైన్ ఎన్టీఆర్ కి వివరించినట్లు… లైన్ బాగుండటంతో మొత్తం స్టోరీ రెడీ చేయాలని… తారక్ అన్నట్లు దీంతో ఇప్పుడు స్క్రిప్టు పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు కూడా టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఇదే సమయంలో కొరటాలతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన్న.. తో సినిమా చేయనున్నారు. వీటి తర్వాత అంతా ఓకే అయితే పరుశురాం సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!