Bheemla Naayak: పవన్ కళ్యాణ్ నటించిన “బీమ్లా నాయక్” ఫిబ్రవరి 25 వ తారీఖున రిలీజ్ కానుంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ సినిమా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపాడు. విషయంలోకి వెళితే ఇదే బ్యానర్ పై “డీజే టీల్లు” విడుదల అయిన సంగతి తెలిసిందే. గత వారం విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
సినిమా విజయం సాధించడంతో సక్సెస్ మీట్ లో నాగ వంశీ సినిమా చూసిన ఆడియన్స్ నీ ఉద్దేశించి ఏకవచనంతో సంబోధిస్తూ కొన్ని కామెంట్ చేయడం జరిగింది. దీంతో నాగ వంశీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విశాఖపట్నంలో జరిగిన సక్సెస్ సమావేశంలో… సినిమా ప్రేక్షకులను ఉద్దేశించి వాడు వీడు అంటూ ఇష్టానుసారంగా నాగ వంశీ చేసిన వ్యాఖ్యలకు చాలామంది నెటిజన్లు మండిపడ్డారు.
దీంతో విషయం తెలుసుకుని నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా క్షమాపణ కోరాడు. ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో డీజే టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రక్షకులకు ఇబ్బంది కలిగించాయనే వార్తలు తెలిసి బాధపడ్డాను’ అంటూ ఆయన నోట్ విడుదల చేశాడు. అలాగే సోదర భావంతోనే వారిని అలా ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడానని, అయినా వారి మనసునొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడినయ్యానన్నాడు. ‘ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం, వారే మా బలం’ అంటూ నిర్మాత నాగవంశీ పేర్కొన్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!