కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలను సొంతం చేసుకున్న మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇప్పుడు ప్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. తదుపరి సినిమా సక్సెస్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాడు. లేకపోతే మెగా కాంపౌండ్ అనే ముద్రతో ఎన్నాళ్లు లాగిస్తాడు మరి. ప్రస్తుతం ఈ యువ హీరోకిషోర్ తిరుమల దర్శకత్వంలో `చిత్రలహరి` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రషెష్ను తేజు మావయ్య చిరుకి చూపించాడట. రషెష్ చూసిన చిరు క్లైమాక్స్ మార్చమని సూచించాడట. అందుకు కారణం అది నెగిటివ్ క్లైమాక్స్గా ఉండటమేనట. తెలుగు ప్రేక్షకులు సుఖాంతమైన క్లైమాక్స్నే కోరుకుంటారు కాబట్టి క్లైమాక్స్ను మార్చితే మంచిదని సూచించడంతో క్లైమాక్స్ మార్చే పనిలో యూనిట్ ఉందట. నాలుగు దశాబ్దాల అనుభవమున్నమావయ్య మెగాస్టార్ చిరంజీవి అనుభవాన్ని తేజ్ అలా వాడుకున్నాడు మరి. సక్సెస్ కోసం తప్పదుగా..
previous post
next post