టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితమే క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గుణశేఖర్. రుద్రమదేవి వంటి చారిత్రక కథను 3డీలో తెరకెక్కించి సంచలనం రేపారు. ప్రస్తుతం రానాతో ‘హిరణ్యకశిప’ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు కూడా ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనుల్లో ఉన్న గుణశేఖర్ పై ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థకు గుణశేఖర్ కు మధ్య వివాదం జరిగిందనే వార్త ఇండస్ట్రీలో సంచలనం రేపింది. అయితే.. దీనిపై గుణశేఖర్ స్పందించారు. ఈమేరకు గుణ టీమ్ వర్క్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖ ఓటీటీ చానెల్ నెట్ ఫ్లిక్స్ తో గుణశేఖర్ ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారని ఓ వార్త వైరల్ అయింది. కథ సిద్ధం చేసి నెట్ ఫ్లిక్స్ టీమ్ కు వినిపించారని.. ఆ కథ నెట్ ఫ్లిక్స్ టీమ్ కు నచ్చలేదని వార్తలు వచ్చాయి. అయితే.. అనుకున్న డీల్ ప్రకారం వర్కౌట్ కాకపోవడంతో వీరద్దరి మధ్య వివాదం జరిగిందని వార్తలు షికారు చేశాయి. హిరణ్యకశిప ప్రారంభం కావడానికి కాస్త సమయం ఉండడంతో ఈలోపు నెట్ ఫ్లిక్స్ కు వెబ్ సిరీస్ చేయాలన్నది గుణశేఖర్ ఆలోచనగా ఆ వార్తలు రౌండ్ అయ్యాయి. ఇండస్ట్రీలో వైరల్ అయ్యిన ఈ వార్తలపై గుణ టీమ్ వర్క్స్ స్పందించింది.
‘నెట్ ఫ్లిక్స్ తో గానీ మరే ఓటీటీ సంస్థకు గుణశేఖర్ వెబ్ సిరీస్ లు చేసే ఆలోచన లేదు. నెట్ ఫ్లిక్స్ తో గుణశేఖర్ ఒప్పందం అనే మాట అబద్ధం. నిరాధారమైన ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. ఈ వార్తల్లో ఎటువంటి నిజమూ లేదు. త్వరలోనే గుణశేఖర్ తన తర్వాతి ప్రాజెక్టుపై ఒక న్యూస్ రివీల్ చేస్తారు’ అని అఫిషియల్ క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ వార్తలన్నింటికీ చెక్ పడింది. అయితే.. గుణశేఖర్ త్వరలో ఇచ్చే అప్డేట్ హిరణ్యకశిప మూవీ గురించే అని వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!