కనికరం చూపని నరరూప రాక్షసులు కొందరు మనుషుల్లోనే ఉంటారు. అలాంటి వారి గురించి చెప్పే చిత్రం దండుపాళ్యం. ఈ చిత్రంలో మూడు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు నాలుగో పార్ట్గా దండుపాళ్యం 4 విడుదలకానుంది. ఈ నాలుగో భాగాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు. సుమన్ రంగనాథన్, ముమైత్ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్కుమార్, కీలక పాత్రధారులు. కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా…
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ “సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాం. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.
దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ “దండుపాళ్యం1,2,3 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్, ముమైత్ఖాన్, సంజీవ్కుమార్, సుమన్ రంగనాథన్ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి`’ అన్నారు.