ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ మధ్యనే రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సతీ వియోగంతో ఒంటరి వాడైన దిల్ రాజు గత నెల 10వ తేదీన వైషు రెడ్డి అలియాస్ తేజస్వినిని నిజామాబాద్ లోని వెంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి చాలా ఎమోషనల్ గా తన తండ్రికి కొత్త జీవితాన్ని ఆనందంగా స్టార్ట్ చేయమని శుభాకాంక్షలు తెలిపారు.
ఇకపోతే తాజాగా దిల్ రాజు లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత భార్య తేజస్విని తో కలిసి విజయవాడ లోని అమ్మవారి ఆలయంలో కనిపించాడు. వెంటనే అక్కడ ఉన్న వారు ఈ టాలీవుడ్ టాప్ నిర్మాత మరియు అతని భార్యని గుర్తుపట్టి ఫోటో క్లిక్ మనిపించారు.
దర్శనం చేసుకుని తిరుగుముఖం పడుతున్నప్పుడు కనబడ్డ వీరి జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇద్దరూ కోవిడ్ నుండి రక్షణగా మాస్కులు వెంటపెట్టుకుని దర్శనం కోసం వెళ్ళడం చాలా ఆదర్శప్రాయం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!