మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవివి దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరో హీరోగా నటిస్తుండగా కోమరం భీం గా ఎన్.టి.ఆర్ మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా చిత్రీకరణ లాక్ డౌన్ తో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనుమతులు వచ్చినప్పటికి తిరిగి సెట్ లోకి వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా ఆర్ ఆర్ ఆర్ బాలీవుడ్, హాలీవుడ్ నటులతో రూపొందుతున్న భారీ కాన్వాయిస్ చిత్రం. ఇది కూడా పెద్ద సమస్యగా మారింది. ఇక దీనికంటే పెద్ద సమస్య కరోనా. రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరిగిపోతూ హడలెత్తిస్తుంది. దీని వల్ల రాం చరణ్ ఇప్పట్లో షూటింగ్ కి హాజరు కాలేనని తెలిపినట్టు సమాచారం.
అంతేకాదు చరణ్ నిర్మాతగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కాజల్ అగర్వాల్ చిరంజీవికి జంటగా నటిస్తుంది. అలాగే మళయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ ని చరణ్.. చిరంజీవితో నిర్మించబోతున్నాడు. సాహో ఫేం సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ సినిమాలని కూడా ఇప్పుడే మొదలు పెట్టాలని చరణ్ అనుకోవడం లేదట. అందుకు కారణ కూడా కరోనా నే. ఈ మహమ్మారితో తండ్రికి సమస్యలు తెలత్త కూడదని తండ్రి ఆరోగ్యం విషయం లో జాగ్రత్తలు వహించాలన్న ఉద్దేశ్యంతోనే ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్ తో, ఆచార్య సినిమాలలో జాయిన్ కావాలనుకోవడం లేదట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!