కళ్లతోనే హావభావాలను వ్యక్త పరిచే మన చందమామ త్వరలో పెళ్లి పేటలనెక్కనున్న సంగతి తెలిసిందే. మగధీరలో మిత్రవిందగా కాజల్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తన నటనతో అందరినీ కట్టిపడేసే ఈ సుందరి మరి కొన్ని రోజుల్లో భార్యగా పోస్టును తీసుకోబోతోంది. ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లు, కాజల్ అగర్వాల్ మధ్య స్నేహం ప్రేమగా మారింది.
ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పేటలెక్కనున్నారన్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే వారి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు సమాచారం వస్తున్నది. అయితే ఈ విషయాన్ని స్వయాన మన చందమామ రాణి మిత్రవింద కాజల్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాకు వెళ్లడించింది. తాను ముంబైకి చెందిన వ్యాపార వేత్తను కిచ్లుని అక్టోబర్ 30 న పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే వారి పెళ్లి అనంతరం వారు కలిసుండబోయే ఇంటిని చక్కదిద్దుకుని పనిలో పడ్డారు ఆ జంట. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ ‘మా కొత్త ఇంటి అలంకరణం ఎలా ఉంది.. మీరేమైనా సలహాలు ఇవ్వగలరా అంటూ ఆ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే వారి పెళ్లి కూడా అతి తక్కువ మందితోనే జరుగుతుందని తెలిపారు. కేవలం 20 మంది అంటే వారి దగ్గరి బందువులు మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్టు చెప్పింది.
కరోనా కారణంగా అందరినీ పిలవలేనందు ఆమె బాధపడ్డారు. కాని గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇంతకు ముందులాగే ఆదరించినట్టు ఇక ముందు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు ఆమె భావాలను వ్యక్తం చేశారు. మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండంటూ చెప్పుకొచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!