రౌడీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. “పెళ్లిచూపులు” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకోవడం జరిగింది. “అర్జున్ రెడ్డి”లో విజయ్ యాక్టింగ్ కి చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా ఫిదా అయ్యారు. “అర్జున్ రెడ్డి” దెబ్బకి యూత్ లో తిరుగు లేని క్రేజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా తర్వాత “గీతగోవిందం”తో మరో రొమాంటిక్ హిట్ అందుకుని అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ విజయ్ దేవరకొండకి ఏర్పడింది.
ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సినిమాలు ఏమీ చేయకపోయినా గాని ఫస్ట్ టైం పూరి జగన్నథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేసి ఉత్తర భారత దేశంలో ప్రమోషన్ కార్యక్రమాలలో మంచి క్రేజ్ దక్కించుకోవడం జరిగింది. ఈ సినిమా ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. దీంతో మొన్నటి వరకు నార్త్ ఇండియాలో ప్రమోషన్ కార్యక్రమాలు జరగా.. ఆగస్టు 14 నుండి సౌత్ లో జరుగుతున్నాయి. ఆగస్టు 14 వ తారీకు వరంగల్ లో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 15వ తారీకు హైదరాబాదు లో “లైగర్” కి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో విజయ్ దేవరకొండ కొత్త విషయాన్ని బయట పెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎంట్రీ ఇవ్వకముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు తెలిపారు. అది కూడా టాప్ దర్శకుడు గా పేరొందిన తేజ గారి టీం తో పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ టైంలోనే పూరి జగన్నాథ్ టీం తో కలిసి పనిచేయడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు. “లైగర్” షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు డియర్ కామరెడ్డి సినిమా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ నీ కలిసినట్లు విజయ్ దేవరకొండ సరికొత్త విషయాలు హైదరాబాద్ “లైగర్” మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!