Intinti Gruhalakshmi: శశికళ ఇచ్చిన డెడ్ లైన్ కి డబ్బులు ఎలా కట్టాలా అని ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయక పోవడంతో తులసి వాళ్ళ అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్లి భోజనం చేయడానికి రమ్మని పిలుస్తుంది.. ఈ సమస్య వచ్చిందని వాళ్ళు బాధపడుతూ ఉంటారు.. సరే మీరు తినకపోతే నేను కూడా తినను అని చెబుతుంది తులసి.. నేటి 555 వ ఎపిసోడ్ హైలైట్స్ ఇలా ఉన్నాయి..
ఇక తులసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అందరినీ భోజనానికి రమ్మని పిలుస్తుంది. అప్పుడే భోజనం కలిపి తులసి నోట్లో పెట్టుకో బోతుండగా.. లాస్య వచ్చి తిను శుభ్రంగా తిను.. కడుపునిండా తిను.. నేను నందు డబ్బులు ఎలా సంపాదించాలి అని రోడ్డుమీద పిచ్చివాళ్ళలా తిరుగుతున్నాము. నువ్వేమో ఇంట్లో కూర్చుని హాయిగా భోజనం చేస్తున్నావు. ఎవరి వాటా వారికి పంచావు కదా.. నీ కష్టం తీరిపోయింది అని అనగానే.. నాకోసమేమి మీరు తిరగటం లేదు కదా.. మీ బాధ్యత కోసం మీరు తిరుగుతున్నారు.. అలా అని నేను తినకుండా ఉంటే మీ కష్టం తీరిపోతుందా.. తీరిపోతుంది అంటే చెప్పు తినకుండా ఉంటాను. అని తులసి రివర్స్ అవుతుంది. నీ గురించి లాస్య చెబుతుంటే ఏమో అనుకున్నాను.. కానీ నువ్వు చాలా కన్నింగ్ అని నందు అంటాడు. ఇక కోపం వచ్చిన తులసి నామీద పడి ఏడవకండి.. వెళ్లి డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించండి. ఇంకా ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది అని చెప్పి.. ఇంట్లో వాళ్లందరినీ భోజనం చేయమని చెబుతుంది.
Read More: Devatha Serial: రాధని అనుమానించిన మాధవ్..!? దేవిని గ్రిప్ లో పెట్టుకోడానికి రాధ ఏం చేసిందంటే.!?
ఇక అభి 10 లక్షలు తీసుకువచ్చి తన ఫ్రెండ్ మనోజ్ కి ఇస్తాడు. ఇక ఆ డబ్బులు వారం రోజుల్లో 30 లక్షలు చేస్తాడు అనుకొని గాల్లో మేడలు మిద్దెలు కడుతూ ఉంటాడు.. ఇక అభి వాళ్లకు ఏదో తేడాగా ఉంది అని తులసి దగ్గరికి వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేయబోగా నేను మునుపటి అభి కాదు. రేపటి నుంచి నా అపాయింట్మెంట్ కోసం మీరే ఎదురు చూసే టైం వస్తుంది. నా సలహాల కోసం మీరే నా దగ్గరికి వస్తాడు వస్తారు అంటూ అభి అమ్మ ముందు విర్రవీగుతూ మాట్లాడుతాడు. నీకు ఏ కష్టం వచ్చినా ఈ అమ్మ ఉందని మర్చిపోవద్దని తులసి చెబుతుంది. ఈ మనోజ్ ఏంటి ఫోన్ ఎత్తట్లేదు సర్లే రేపు పొద్దున వీడి సంగతి చూసుకుందామని అనుకుంటాడు.
అభి తన ఫ్రెండ్ మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంటుంది అంతలో హౌస్ ఓనర్ వచ్చి ఇది నా ఇల్లు అద్దెకు ఉండేవాడు ఎక్కడికి వెళ్ళాడు ఫ్రెండ్ గా నువ్వే ఫోన్ చేసి కనుక్కో అని చెబుతోంది ఇక మనోజ్ కి ఫోన్ చేస్తాడు మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేసి నీ డబ్బులు తీసుకుని నేను పారిపోయానని నీకు ఇవ్వను అని చెబుతాడు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెబుతాడు. పది లక్షలను తీసుకొచ్చి వారం రోజుల్లో 30 లక్షలు చేయమంటావ్.. నీది మోసం కాదా అని అంటాడు అది అత్యాశ ఎందుకు అవుతుంది నీలాంటి వాళ్ళను వెతుక్కునీ ఇలా మోసం చేయడమే నా పని.. ఇక నుంచి ఈ నెంబర్ కి కాల్ చేయకు నీతో మాట్లాడిన తర్వాత ఈ సిమ్ కార్డ్ తీసేసి పక్కన పడేసాను. రేయ్ రేయ్ ప్లీజ్ రా ఆ డబ్బులు నాకు నా డబ్బులు ఇచ్చేయ్యి.. నా జీవితం నాశనం చేయొద్దు అంటూ అభి మనోజ్ ను వేడుకుంటాడు.. మోసం చేసే వాడికి జాలిగుణం ఉండకూడదు.. జాలిగుణం ఉన్న వాడు మోసం చేయలేడు ముందు ఆ విషయం తెలుసుకో అని అభి కళ్ళు తెరిపిస్తాడు.
అభి నిట్టనిలువునా మునిగిపోయిన విషయం వాళ్ళమ్మకు తెలిసిపోతుందా.. అభి అప్పు చేసిన విషయం ఇంట్లో తెలిసి తులసి ఎలాంటి గొడవ చేస్తుంది.. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో.. అంకిత నిజంగా అభిని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లి పోతుందా.. ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!