Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించిన కంగనా.. డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిపోయింది. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. 2006లో వచ్చిన `గాంగ్ స్టర్` మూవీ సినీరంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాల స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో ఒకరైన కంగనా.. తెలుగులోనూ నటించింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఏక్ నిరంజన్` మూవీలో ప్రభాస్కు జోడీగా కంగనా చేసింది. 2009 లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ తర్వాత కంగనా టాలీవుడ్ వైపు చూడలేదు. బాలీవుడ్లోనే నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ అక్కడ స్థిరపడిపోయింది. అలాగే ఉన్నది ఉన్నట్లుగా, ముక్కుసూటిగా మాట్లాడి తరచూ ఏదో ఒక వివాదంలో నిలిచే కంగనా.. తాజాగా తన గ్యారేజ్లోకి కొత్త కారును ఆహ్వానించింది. అవును, తాజాగా ఈ బ్యూటీ మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్680 మోడల్ కారును కొనుగోలు చేసింది.
ఈ కారు ఖరీదు ఎంతో తెలిస్తే దిమ్మతిరాగాల్సిందే. ఈ కారు ధర దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుందట. అంతేకాకుండా ఇంత ఖరీదైన లగ్జరీ సెడాన్ కారుని కొన్న మొదటి ఇండియన్ నటి కంగనానే అట. ఇక ఈ కారు డిలివరీ తీసుకోవడానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది కంగనా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, కంగనా తాజా చిత్రం `ధాకడ్` మే 20న వరల్డ్ వైడ్గా విడుదలై సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్కి ఒక రోజు ముందు కొత్త కారును కంగనా సొంతం చేసుకోవడం విశేషం.
https://www.instagram.com/reel/Cdvp5wvlRnx/?utm_source=ig_web_copy_link
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!