Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వరుస సక్సెస్లతో మాంచి జోరుగా మీద ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది `లవ్ స్టోరీ ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన చైతు.. ఆ ఏడాది ఆరంభంలో `బంగార్రాజు` సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో నాగార్జున మరో హీరోగా నటించాడు.
ఇక ప్రస్తుతం చైతు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` అనే సినిమా, `ధూత` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇందులో థ్యాంక్యూ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. సమ్మర్ తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధూత విషయానికి వస్తే ఇటీవలె ఇది సెట్స్ మీదకు వెళ్లిన ఈ వెబ్ సిరీస్లో మాలీవుడ్ బ్యూటీ పార్వతి, ప్రియా భవాని శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇయర్ ఎండ్ కు అమెజాన్ ప్రైమ్ లో ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చైతు మరో కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించాడు. `మానాడు` మూవీతో సూపర్ హిట్ అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో నాగ చైతన్య తన 22వ సినిమాను చేయబోతున్నాడు.
ఈ న్యూ ప్రాజెక్ట్ను కొద్ది సేపటి క్రితమే అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చైతు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!