Janasena Party: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టమైన సంకేతాలు, కొన్ని అంతరార్ధాలు ఉన్నాయి. అవి ఏమిటి..? ఆయన ఉద్దేశం ఏమిటి..?జనసేన లక్ష్యాలు ఏమిటి..? అనేది పరిశీలిస్తే.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వమని మళ్లీ స్పష్టంగా పవన్ చెప్పారు. ఆ మాట ఆలోచించే అన్నాను, రాజకీయ వ్యూహంతో అనలేదు అని పేర్కొన్నారు. దీనితో పాటు ఒకరి పల్లకీలు మోయడానికి నేను లేను అని చెప్పారు. ఆ మాట అన్నారు అంటే తాను వైసీపీ ఓట్ల చీలనివ్వకుండా చేసి టీడీపీకి సపోర్టు చేసి వాళ్లను పల్లకీ ఎక్కించేందుకు సిద్ధంగా లేను అని టీడీపీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బేషరతుగా టీడీపీకి మద్దతు ఇచ్చి అధికారాన్ని చేతిలో పెడతాము అని అనుకోవద్దు అన్నట్లుగా ఓ సందేశం ఇచ్చారు.
Read More: TDP Janasena: ఆ పొత్తులపై టీడీపీలో భయం భయం..! జనసేనతో పేచీలు టీడీపీ టెన్షన్..!?
Janasena Party: “పవర్ షేరింగ్” అర్ధంతో
అదే విధంగా 2024లో వైసీపీ కఛ్చితంగా అధికారంలోకి రాదు గాక రాదు అని, దాన్ని ఆ నాయకులు, అధికారులు తెలుసుకోవాలి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ముక్కోణపు పరిస్థితిలో పవన్ కళ్యాణ్ మాటలను స్పష్టం అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అంటే టీడీపీతో పొత్తుకు ఒక సంకేతం. వాళ్ల పల్లకీ మోయడానికి తాను సిద్ధం గా లేను అని చెప్పడం ద్వారా మీతో పొత్తుకు రెడీ కానీ మిమ్మల్ని పల్లకీ ఎక్కించను అని ఇంకో సంకేతం ఇచ్చారు. ఆయన మాటలను బట్టి చూస్తే “పవర్ షేరింగ్” కావాలి అనేది అర్ధం అవుతోంది. ఇది వూహాత్మకంగా టీడీపీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లే కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీని దించడానికి తన వద్ద ప్రణాళికలు ఉన్నాయి అంటూ బీజేపీ కూడా కొన్ని ప్రణాళికలు వేస్తుంది అని చెప్పి బీజేపీని ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. ఇదే సందర్భంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడం కోసం రాబోయే ఏడాదిన్నరలో తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్.