Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” సినిమా ప్రీ రిలీజ్ వేడుక మరి కొద్దిరోజులు జరగనుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా అక్కినేని అఖిల్ ని చూపించడం జరిగింది. ఈ సినిమాలో అఖిల్ బాడీ పూర్తిగా గత చిత్రాలకు భిన్నంగా ఉంది. చాలా రుడ్ రగడ్ పాత్రలో కనిపిస్తున్నాడు. “ఏజెంట్” తెలుగులో నిర్మించిన స్పై థ్రిల్లర్ సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ తో పాటు మమ్ముట్టి, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ క్రమంలో త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చరణ్, తారక్ నీ తీసుకురావడానికి నాగార్జున బిగ్ ప్లాన్ వేయడం జరిగిందట. “RRR” నాటు నాటు సాంగ్ కీ ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరినీ ఘనంగా సన్మానించాలని డిసైడ్ అయ్యారట. దీంతో మరోసారి చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఇటీవల ఈ ఇద్దరిని సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం.
మార్చి 13వ తారీకు ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత ఎవరికి వారు అమెరికా నుండి వచ్చేశారు. ఈ క్రమంలో మొదట తారక్ వచ్చేయడం జరిగింది. అనంతరం చరణ్ మొదట ఢిల్లీలో దిగి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు సత్కరించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!