టాలీవుడ్ లో కొత్తగా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. అందులో ఎంతో ఆసక్తి రేకెత్తించిన కాంబినేషన్ అంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ. ఈ సినిమా అనౌన్స్ చేయగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కారణం కేజీఎఫ్ తో నేషన్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. దీనికి హీరోగా ఎన్టీఆర్ తోడవడంతో ఇంకా హైప్ క్రియేట్ అయిపోయింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ లో సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. అయితే.. ఇండస్ట్రీలో రౌండ్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ ఇంకా ఆ సినిమాకు 30శాతం షూటింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వచ్చే ఏడాది ప్రధమార్ధానికి పూర్తయితే.. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.
అంటే.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రివిక్రమ్ తో సినిమా వచ్చేదా 2022లో. అప్పటికి గానీ ఎన్టీఆర్ సినిమా ఇవ్వలేడు. దీంతో ప్రశాంత్ నీల్ తో సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా జరుగుతోంది. దసరాకు గానీ ఆ తర్వాత గానీ రిలీజ్ చేయాలని ప్లాన్. మరి ఎన్టీఆర్ ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుంటే అప్పటివరకూ ప్రశాంత్ నీల్ వెయిట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!