Nayanthara-Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్లు చిక్కుల్లో పడ్డారు. తాజాగా సాలిగ్రామానికి చెందిన సోషలిస్ట్ కణ్ణన్ అనే వ్యక్తి.. రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను నిషేధించాలని, దాని వ్యవస్థాపకులైన డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నటి నయనతారలను అరెస్ట్ చేయాలని కోరుతూ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
అసలు ఈ ఫిర్యాదు వెనక స్పష్టమైన కారణం బయటకు రాకపోయినా.. కోలీవుడ్లో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్గా మారింది. అయితే నయన్-విఘ్నేష్లపై కేసు నమోదు అవ్వడానికి సోషల్ మీడియాలు రెండు కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. అదేంటంటే.. మొన్నీ మధ్య విఘ్నేష్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్తో ప్రకటించిన సంగతి తెలిసిందే.
రౌడీ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ సినిమాలో నయన్ హీరోయిన్గా నటించబోతోంది. అయితే అజిత్తో ప్రాజెక్ట్ ప్రకటించిన సందర్భంగా విఘ్నేష్ శివన్ అతని రౌడీ పిక్చర్స్ టీమ్ కలిసి భారీ స్థాయిలో పటాకులు పేల్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వారి సెలెబ్రేషన్స్ తో చుట్టు పక్కల ప్రజలను డిస్ట్రబ్ చేశారని, ప్రజలకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించారని.. అందుకే కణ్ణన్ కేసు నమోదు చేశాడని ప్రచారం జరుగుతోంది.
అలాగే మరో వాదన కూడా వినిపిస్తోంది. రౌడీలను అణిచివేసేందుకు తమిళనాడు పోలీసులు పలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో రౌడీలను ప్రోత్సహించే విధంగా నయన్-విఘ్నేష్ల నిర్మాణ సంస్థ పేరు ఉందని.. అందు కారణంగా కణ్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని కూడా అంటున్నారు. మరి వీటిలో ఏది నిజమో త్వరలోనే తెలియనుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!