Prabhas: తెలుగు చలన చిత్ర రంగంలో వైజయంతి మూవీస్ బ్యానర్ కి మంచి పేరుంది. ఈ బ్యానర్ లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు రావటం జరిగాయి. అయితే 50వ సినిమా బ్యానర్ లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోంది. వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ కె పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకుడు నాగ్ అశ్విన్. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబచ్చన్ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్న షూటింగ్ లో హీరోయిన్ దీపికా పదుకొనే అస్వస్థతకు గురైంది. గుండె వేగంగా కొట్టుకోవటంతో వెంటనే హైదరాబాద్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది. ఈ వార్త బయటకు రావడంతో దీపికాపదుకునే అనారోగ్యం కారణంగా ప్రభాస్ సినిమా ఆగిపోయినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో వస్తున్న వార్తలకి చెక్ పెట్టే రీతిలో నిర్మాత అశ్వనీదత్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ సినిమా ఆగిపోలేదని, ఎక్కడ కూడా షూటింగ్ వాయిదా పడలేదని తెలియజేశారు. దీపికా పదుకునే అనారోగ్యానికి గురైన గాని ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని కొన్ని గంటల్లోనే సెట్స్ లోకి వచ్చేసింది అని తెలిపారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం గానే సినిమా షూటింగ్ జరుగుతుందని ఎక్కడ ఆగిపోలేదని పేర్కొన్నారు. ప్రజెంట్ అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికాపదుకునే పాత్రలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 21వ తారీకు నుండి పది రోజుల పాటు ఈ షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ కానున్నట్లు తెలియజేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!